ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ యువత, క్రీడాకారులతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో టీమిండియా టీ20 వైస్ కెప్టెన్ తిలక్ వర్మ కూడా పాల్గొన్నాడు. ‘ఖేలో ఇండియా డైలాగ్’ పేరిట జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఇచ్చిన సందేశంపై ఈ డాషింగ్ బ్యాటర్ ప్రశంసలు కురిపించాడు. క్రీడల ద్వారా యువత డ్రగ్స్కు దూరంగా ఉండవచ్చని, 2036 ఒలింపిక్స్లో మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని ప్రధాని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఛత్తీస్గఢ్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమ ప్రసారానికి హాజరైన తిలక్ వర్మ, అనంతరం మీడియాతో మాట్లాడాడు. “ఇది చాలా మంచి కార్యక్రమం. ప్రధాని మోదీ యువతకు బలమైన సందేశాన్ని ఇచ్చారు. యువత డ్రగ్స్కు దూరంగా ఉండటం అత్యవసరం. ఇలాంటి కార్యక్రమాలు యువతను చెడు మార్గాల నుంచి దూరం చేయడానికి ఎంతగానో దోహదపడతాయి” అని అన్నాడు. తాను గతంలో క్రికెట్ ఆడేందుకు ఛత్తీస్గఢ్కు వచ్చానని, ఇక్కడ క్రీడలకు మంచి భవిష్యత్తు ఉందని అభిప్రాయపడ్డాడు.

